Friday, March 15, 2024

జర్మన్‌ చర్చిలో కాల్పులు.. 8 మంది దుర్మరణం

జర్మన్‌లోని ఓ చర్చిలో కాల్పుల కలకలం సంచలనంగా మారింది. ఈ ఘటనలో 8మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్టు సమాచారం. అయితే మృతుల సంఖ్య ఎంత అనేది పోలీసులు పక్కాగా చెప్పలేకపోతున్నారు.

ఘటనా స్థలంలో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. స్థానికులు ఇళ్లల్లో నుంచి బయటకు రాకూడదని హెచ్చరించారు. కాల్పులు జరిగిన సమయంలో విట్నెస్‌ వర్గానికి చెందిన ప్రజలు బైబిల్‌ అధ్యయనం చేస్తున్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా ప్రమాదవశాత్తు చనిపోయినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement