Wednesday, April 24, 2024

రాజ‌స్థాన్ జైస‌ల్మీర్ లో.. మోహ‌న్ లాల్ కొత్త చిత్రం

మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్ లాల్ కొత్త చిత్రం స్టార్ట్ అయింది. లిజో జోష్‌ పెల్లిస్సెరీ దర్శకత్వంలో మలైకొట్టై వాలిబన్ తెర‌కెక్కుతోంది. పీరియాడిక్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని మ్యాక్స్ ల్యాబ్స్‌-సెంచురీ ఫిలిమ్స్‌ బ్యానర్లపై జాన్‌-మేరీ క్రియేటివ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్ వచ్చింది. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఈ మూవీ షూటింగ్ షురూ అయింది.లిజో జోష్‌ టీం మోహన్‌ లాల్‌పై వచ్చే కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెట్టింది. షూటింగ్‌ లొకేషన్స్ లో తీసిన స్టిల్స్ నెట్టింట ట్రెండింగ్‌ అవుతున్నాయి. ఈ చిత్రంలో విశ్వ న‌టుడు కమల్ హాసన్‌ కూడా నటిస్తున్నార‌ని ఇప్పటికే వార్తలు రాగా.. ఈ అప్‌డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. మలైకొట్టై వాలిబన్‌లో బాలీవుడ్ యాక్టర్‌ విద్యుత్‌ జమ్వాల్‌, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్‌ సేత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ప్రస్తుతం 10 సినిమాలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు మోహన్‌ లాల్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement