Wednesday, April 24, 2024

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. రాష్ట్రంలో గ్రామాలను కార్పొరేషన్, పురపాలక సంఘాల్లో విలీనం చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, చట్టసవరణను సవాల్ చేస్తూ హైకోర్టులో 46 మంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన హైకోర్టు.. కార్పొరేషన్‌లు, పురపాలక సంఘాల్లో పలు గ్రామాలను విలీనం చేస్తూ వాటికి ఎన్నికలు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, చట్టసవరణపై మూడు వారాల పాటు స్టే విధించింది.

ఈ సందర్భంగా ఆర్డినెన్స్, చట్ట సవరణపై దాఖలైన అన్ని పిటిషన్‌లను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. మూడు వారాల్లో తుది విచారణ పూర్తి చేస్తామని.. అప్పటివరకు ఎన్నికలు నిర్వహించొద్దని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కూడా ప్రభుత్వానికి సూచించింది. కాగా నగర పాలక సంస్థల్లో గ్రామాలను విలీనం చేయడం వల్ల పన్నులు పెరగడం మినహా ఒరిగేదేమీ లేదని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఈ వార్త కూడా చదవండి: ‘అమర్‌రాజా’ది రాజకీయ సమస్య కాదు.. కాలుష్య సమస్య: రోజా

Advertisement

తాజా వార్తలు

Advertisement