Wednesday, April 24, 2024

పడవ బోల్తా 57 మంది మృతి..

లిబియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సముద్రంలో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడి ఏకంగా 57 మంది మృతి చెందారు. లిబియా దేశం పశ్చిమ తీర పట్టణం ఖుమ్స్‌ నుంచి ఆదివారం రోజున శరణార్థులతో బయలు దేరిన పడవ సముద్యంలో బోల్తా కొట్టందని అంతర్జాతీయ వలస దారుల సంస్థ లో ఉన్న కీలకమైన అధికారి సఫా మెహ్లీ తెలిపారు. పడవలో 75 మంది ఉండగా 57 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మిగిలిన 18 మంది శరణార్థులు… సముద్రంలో ఈదుకుంటూ నిన్న రాత్రికి ఒడ్డుకు చేరినట్లు స్పష్టం చేశారు అధికారి సఫా మెహ్లీ. ఇక మృతి చెందిన 57 మంది శరణార్థులలో ఎక్కువగా.. నైజీరియా, ఘనా మరియు గాంబియా దేశాలకు చెందిన వారే ఉన్నట్లు అధికారులు తేల్చేశారు.

ఇది కూడా చదవండి : RRR అప్‌డేట్ వచ్చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement