Thursday, April 25, 2024

శిల్పాశెట్టిలకు, రాజ్ కుంద్రా దంపతులకు రూ.3 లక్షల జరిమానా..

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు సెబి 3 లక్షల జరిమానా విధించింది. ఇప్పటికే రాజ్ కుంద్రా ఫోర్న్ రాకెట్ కేసులో అరెస్ట్ కాగా ఇప్పుడు మరో గట్టి దెబ్బ తగిలింది. సెప్టెంబర్ 1, 2013 నుండి డిసెంబర్ 23, 2015 మధ్యకాలంలో వయాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో ట్రేడింగ్‌పై సెబి విచారణ చేపట్టింది. అలియాస్ రిపు సుడాన్ కుంద్రా, అతని సంస్థ వియాన్ ఇండస్ట్రీస్ అంతర్గత వ్యాపారంలో సరైన నిబంధనలను పాటించనందుకు ‘మార్కెట్స్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ దోషులుగా తేల్చింది.

రాజ్ కుంద్రా, శిల్పా వయాన్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు. అక్టోబర్ 2015లో వియాన్ ఇండస్ట్రీస్ నలుగురు వ్యక్తులకు రూ.5 లక్షల షేర్లకు ప్రాధాన్యత కేటాయింపు చేసింది. అందులో 1,28,800 షేర్లు రాజ్ కుంద్రా, శిల్పా శెట్టికి కేటాయించారు. ఒక్కొక్క షేర్ విలువ రూ.2.57 కోట్లు. మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకారం అయితే 2015 లావాదేవీలకి సంబంధించి మే 2019లో తుది వెల్లడి జరిగింది.

ఇది కూడా చదవండి: అలర్ట్: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా ఉధృతి..

Advertisement

తాజా వార్తలు

Advertisement