Friday, April 19, 2024

శ‌శిక‌ళ‌తో ..విజ‌య‌శాంతి – ఏం జ‌రుగుతోంది !

దివంగ‌త ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత స్నేహితురాలు శ‌శిక‌ళ‌..బిజెపి మ‌హిళా నేత విజ‌య‌శాంతి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా
శశికళ తన భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై విజయశాంతితో చర్చించార‌ట‌. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే నుంచి బయటకు వెళ్లిపోయిన వారిని తిరిగి పార్టీలో చేర్పించే యత్నాల్లో బీజేపీ ఉందని, అందులో భాగంగానే శశికళతో విజయశాంతి భేటీ అయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో శశికళ జైలు నుంచి విడుదలైన తర్వాత విజయశాంతి ఆమెను కలిశారు. ఇప్పుడు మరోసారి ఇద్దరూ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, ఇకపై ఆధ్యాత్మిక జీవితం గడపాలని నిర్ణయించుకున్నట్టు అప్పట్లో శశికళ ప్రకటించారు. అందులో భాగంగా ఆధ్యాత్మిక యాత్ర పేరుతో రాష్ట్రంలోని ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఆమెను కలిసిన మద్దతుదారులు తిరిగి రాజకీయాల్లోకి రావాలని కోరడంతో ఆమె మనసు మార్చుకున్నారు. మళ్లీ రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తానని అప్పట్లో చెప్పారు. అన్నాడీఎంకేకు తిరిగి సారథ్యం వహించాలని చాలామంది నేతలు తనను కోరినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయశాంతితో భేటీ కావడం తమిళ రాజకీయాల్లో హీట్ పెంచింది. మ‌రి అస‌లు ఏం జ‌రిగుతుంద‌నే విష‌యంపై శ‌శిక‌ళ కానీ ..విజ‌య‌శాంతి కానీ నోరువిప్పితేనే అస‌లు సంగ‌తి బ‌య‌టికి వ‌స్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement