Saturday, April 20, 2024

బాలకృష్ణ చేతిలో బుక్ అయిన శర్వానంద్..అడవి శేషు

ప్రస్తుతం అన్ స్టాపబుల్ 2 సీజన్ కొనసాగుతోంది. ఈ సీజన్ 2లో 3వ ఎపిసోడ్ ఈ నెల 4వ తేదీన ‘ఆహా’లో పలకరించనుంది. ఈ ఎపిసోడ్ లో యంగ్ హీరోలు శర్వానంద్ – అడివి శేష్ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం రన్ అవుతోంది. శర్వా – శేషు ఇద్దరూ కూడా బ్యాచ్ లర్స్ కావడంతో, ఆ విషయాన్ని హైలైట్ చేస్తూ మరింత కామెడీగా ఈ షో హోస్ట్ హీరో బాలకృష్ణ ఈ టాక్ షోను నడిపించారనే విషయం ఈ ప్రోమోను బట్టి అర్థమవుతోంది. అంతేకాదు, ఈ ఇద్దరినీ బాలకృష్ణ ఇరకాటంలో పెట్టారు. బాలకృష .. చిరంజీవి .. నాగార్జున .. వెంకటేశ్ .. ఈ నలుగురిలో ఎవరు నెంబర్ వన్ యాక్టర్ అని అడగడంతో ‘మహాప్రభో’ అంటూ ఇద్దరూ కూడా చేతులెత్తేశారు. ఏ హీరోయిన్ తో కిస్ వద్దురా బాబూ అనిపిస్తుంది అంటూ మరో ప్రశ్నను బాలయ్య సూటిగా సంధించారు. సినిమాలు చేసినప్పుడు ఫ్లాపులు రావడం సహజం. కానీ అసలు సినిమాలే చేయలేని పరిస్థితి వస్తే అంటూ శర్వానంద్ కి ‘జాను’ సినిమా షూటింగులో జరిగిన ప్రమాదాన్ని గురించి బాలయ్య ప్రస్తావించారు. అప్పుడు మాత్రం శర్వా కాస్త ఎమోషనల్ అయ్యారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement