Friday, April 26, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో – రూ.28.52ల‌క్ష‌ల విలువైన బంగారం ప‌ట్టివేత‌

ఈ మ‌ధ్య‌కాలంలో హైద‌రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో త‌ర‌చుగా బంగారం ప‌ట్టుబ‌డుతోంది. కాగా తాజాగా దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 554.20 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీనివిలువ రూ.28.52 లక్షలు ఉంటుందని తెలిపారు. విమానాశ్రయంలోని ఏఏఆర్‌ ఫెసిలీటీ సర్వీస్‌ ప్రైవేటు ఉద్యోగి ద్వారా బంగారాన్ని తరలించేందుకు నిందితుడు ప్రయత్నించాడని వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. గాజులు, బిస్కెట్లు, గొలుసుల రూపంలో బంగారాన్ని తీసుకొచ్చాడని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement