Thursday, March 28, 2024

టెస్ట్ సిరీస్ కు షమీ, జడేజాలు దూరం ?

గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన బౌలర్‌ మహమ్మద్‌ షమీ, ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజాలు టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. వీరిద్దరు గాయాల నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జడేజాస్థానాన్ని యూపీ లెప్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ సౌరభ్‌కుమార్‌ భర్తీ చేసే యోచనలో బీసీసీఐ ఉంది. అటు షమీ స్థానంలో పేసర్‌ నవదీప్‌ సైనిని ఎంపిక చేయొచ్చు. ఈ ఇద్దరు ఆటగాళ్లు బంగ్లాదేశ్‌ ఏ తో జరుగుతున్న అనధికార టెస్టు సిరీస్‌లో పాల్గొంటున్నారు.

కొత్త రక్తానికి అవకాశం

యూపీ స్పిన్నర్‌ సౌరభ్‌కుమార్‌ రంజీ ట్రోఫీలో నిలకడగా రాణించాడు. టెయిలెండర్‌గా వచ్చి జట్టుకు విలువైన పరుగులు చేశాడు. ఇటీవలె 55 బంతుల్లో39 పరుగులు చేశాడు. అటు షమీ స్థానంలో నవదీప్‌ సైనిని ఎంపిక చేస్తే ఉమేష్‌ యాదవ్‌ , శార్దూల్‌ ఠాకూర్‌, సిరాజ్‌తో కలిసి ఆడనున్నారు. మరోవైపు రెండో వన్డేలో బొటనవేలికి గాయం కావడంతో స్వదేశానికి చేరుకున్న రోహిత్‌ శర్మ కూడా బంగ్లాతో జరిగే టెస్ట్‌ సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువే. ఈ నేపథ్యంలో రోహిత్‌ స్థానాన్ని యువప్లేయర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ టెస్ట్‌ సిరీస్‌కు ఎంపికైతే ఓపెనింగ్‌ చేసే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement