Saturday, April 20, 2024

మక్కాలో షారుక్ ఖాన్.. వైరల్ గా ఫొటోస్

బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న డుంకి సినిమాలో నటిస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది.. ఇందులో కీలక షెడ్యూల్ ను సౌదీ అరేబియాలో చేస్తున్నారు. ఈ షూటింగ్ కోసం మూవీ టీమ్ అంతా సౌదీ వెళ్లింది. కాగా అక్కడ షూటింగ్ షెడ్యూల్ పూర్తీ చేసుకున్న తరువాత షారుఖ్ ఖాన్ అక్కడి పవిత్ర మక్కా మజీద్ ను సందర్శించారు. పవిత్ర నగరాన్ని సందర్శించుకున్నాడు. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ మక్కాలో ఉమ్రా చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న ఒక అభిమాని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోటోలో షారుఖ్ డిఫరెంట్ గా ఉన్నాడు. వాళ్ల ట్రెడిషన్ ప్రకారం వైట్ కలర్ క్లాత్ ఒక వైపుగా వేసుకుని ఉన్నారు షారుఖ్. ఉమ్రా అంటే సౌదీ అరేబియాలో చేసే మక్కా యాత్ర అని అర్ధం. స్పెషల్ డివోషనల్ లుక్ లో ఉన్న షారుఖ్ ఖాన్ ఫోటోలు వైరల్ అవ్వడంతో అది చూసిన ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఆ పిక్ ను నెట్టింట మరింత వైరల్ చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే..ఇక షారుఖ్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పఠాన్ మూవీ షూటింగ్ పూర్తీ చేయగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. అటు తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ మూవీ చేస్తున్నాడు షారుఖ్ ఖాన్. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాపై అటు బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement