Thursday, April 25, 2024

గంజాయి రవాణా కేసులో ఏడుగురు అరెస్ట్.. తిరుప‌తి జిల్లాలో ఘ‌ట‌న‌

సూళ్లూరుపేట (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : పెద్ద మొత్తంలో గంజాయి రవాణా చేస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేసి రూ.3.84 లక్షల విలువైన 25 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఆదివారం జరిగింది. నాయుడుపేట డీ ఎస్ పీ రాజగోపాల్ రెడ్డి తెలిపిన వివ‌రాల ప్రకారం.. సూళ్లూరుపేట సిఐ వేంకటేశ్వరరెడ్డీ ఎస్ఐ నేతృత్వంలో చేపట్టిన దాడుల్లో సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ రోడ్డు లోనే పోస్ట్ ఆఫీస్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఏడుగురిని అదుపులో తీసుకున్నారు.

వారినుంచి రూ 3,84,000 విలువైన 24 కేజీల గంజాయి, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదని కేసులలో పట్టుబడిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెడుతున్నామని, అక్రమ రవాణా పై ఏదైనా సమాచారం ఉంటే పోలీసు వారికి తెలియపరచాలని విజ్ఞప్తి చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement