Friday, March 29, 2024

నిరుద్యోగులకు పంగనామం పెట్టిన వైసీపీ నేత

విజయనగరం జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత నిరుద్యోగులకు పంగనామం పెట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బాడంగి వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి పెద్దింటి రామారావు తమను మోసం చేశారంటూ బాధితులు రోడ్డెక్కారు. పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI)లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి పెద్దింటి రామారావు రూ.25 లక్షలకు పైగా వసూలు చేశారని బాధితులు ఆరోపించారు. తాము మోసాన్ని గ్రహించి డబ్బు వెనక్కి తిరిగి ఇవ్వాలంటూ ఏడేళ్లుగా తిరుగుతున్నా లాభం లేదని వాపోయారు. ఒక్కొక్కరి నుంచి రూ. 15 నుంచి 25 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు చెప్తున్నారు. డబ్బులు ఇవ్వాలని అడుగుతున్న తమను వైసీపీ నేత పెద్దింటి రామారావు బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement