Wednesday, April 24, 2024

రూ.70 లక్షల విలువైన బంగారం పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఈరోజు ఉదయం కస్టమ్స్ నిఘా విభాగం అధికారులు విదేశీ బంగారాన్ని పట్టుకున్నారు. రూ.70 లక్షల విలువ చేసే 1100 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దీనిలో భాగంగా ఇద్దరిని అరెస్ట్ చేశారు. బంగారాన్ని క్యాప్సూల్స్‌లో నింపి పొట్టలో దాచి తరలించే యత్నం చేశారు. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్క్రీనింగ్‌లో బంగారం బయట పడింది. మరో ప్రయాణీకుడి లగేజ్ బ్యాగ్ లో అక్రమ బంగారాన్ని గుర్తించారు. ఇద్దరు దుబాయ్ ప్రయాణికులపై కస్టమ్స్ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement