Thursday, March 28, 2024

HYD: రూ.9కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..

హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టయ్యింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో విదేశాలకు మత్తు మందు ఎగుమతి చేస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి కొరియర్‌ ద్వారా విదేశాలకు సరఫరా చేస్తున్నారని రాచకొండ పోలీసులు తెలిపారు. దాని విలువ రూ.9 కోట్లు ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement