టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ కరోనా రోగుల ఆకలి తీరుస్తున్నాడు. లాక్డౌన్ సమయంలోనూ దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు 51 వేల మందికి భోజనం పంపిణీ చేశాడు. ఢిల్లీలో కరోనా బారిన పడి, ఆహారం కావాలంటే ట్విట్టర్ ద్వారా డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరాడు. సెహ్వాగ్ అందించే పార్శిళ్లలో చపాతీ, అన్నం, ఓ ఫ్రై, పప్పు, టమాట రైస్ లాంటివి ఉన్నాయి. సెహ్వాగ్ ఫౌండేషన్ తరఫున తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వీరూ వివరించాడు.
మాజీ క్రికెటర్ సెహ్వాగ్ మంచి మనసు.. 51వేల మందికి అన్నదానం
By ramesh nalam
Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement