Tuesday, April 23, 2024

శున‌కానికి సీమంతం.. ఎక్కడో తెలుసా

ప్ర‌భ‌న్యూస్ : నిన్న మొన్న‌టి వ‌ర‌కు గోవుకు సీమంతం చేయ‌డం చూశాం… తాజాగా త‌మిళ‌నాడులో ఓ పెంపుడు కుక్క‌కు సీమ‌తం చేయ‌డం విశేషం. ఇరుగుపొరుగు వారిని, స‌న్నిహితుల‌ను ఆహ్వానించి, ఘ‌నంగా వేడుక నిర్వ‌హించారు. పెంపుడు కుక్క‌కు పూల‌మాల వేసి అలంక‌రించారు. కాళ్ల‌కు గాజులు తొడిగారు. ప‌సుపు రాశారు. తిల‌కం దిద్దారు. హార‌తి ఇచ్చి ఆశీర్వ‌దించారు. కుటుంబ స‌భ్యుల‌తోపాటు ఆహ్వానితులంద‌రూ అక్షింత‌లు వేసి ఆశీర్వ‌దించారు. అనంత‌రం పెంపుడు కుక్క‌కు పంచ‌భ‌క్ష ప‌ర‌మాన్నం పెట్టారు. అతిథులంద‌రికీ భోజ‌నాలు పెట్టారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రం మ‌ధురైలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement