Thursday, March 28, 2024

భారత్ బయోటెక్​ ముందు సీఐఎస్​ఎఫ్ భారీ భద్రత..

కొవిడ్ – 19 వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ తయారు చేస్తోన్న హైదరాబాద్ లోని భారత్ బయోటెక్​ సంస్థకి భారీగా భద్రత పెంచారు. కేంద్రం నిర్ణయం మేరకు ఇవాళ్టి నుంచి హైదరాబాద్ శామీర్ పేట్ లో ఉన్న భారత్​ బయోటెక్​ ప్లాంట్ కు సీఐఎస్​ఎఫ్ భద్రతా చర్యలు చూస్తున్నారు. శామీర్​పేటలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న సంస్థ కార్యాలయాన్ని, ప్లాంట్‌ను పారా మిలిటరీ ఫోర్స్‌కు చెందిన 64 మంది కమాండోలు నిరంతరం భద్రతను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉగ్రవాదులు ముప్పు నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్​ కి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించిన మేరకు నేటి నుంచి పహారా షురూ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement