Tuesday, April 16, 2024

జయంత్ పనుగంటి దర్శకత్వంలో.. సాయి ధరమ్ తేజ్ 16వ సినిమా

దర్శకుడు కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టరీ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. సుకుమార్‌ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా సెట్స్‌పైన ఉండగానే సాయిధరమ్‌ తాజాగా మరో సినిమాను ప్రారంభించాడు. జయంత్‌ పనుగంటి దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్ తన 16వ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్‌ అయింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించనుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement