Friday, April 26, 2024

మధుమేహం రోగులకు గుడ్ న్యూస్.. ఇకపై లాలాజలంతోనే షుగర్ టెస్ట్

డయాబెటిస్ రోగులకు ఇకపై షుగర్ టెస్ట్ మరింత సులభతరం కానుంది. రక్తంలో చక్కెర స్థాయిని పరీక్షించే విధానానికి బదులుగా లాలాజలంతోనే వైద్యులు ఆ పరీక్ష చేయనున్నారు. ఆస్ట్రేలియాలోని న్యూ క్యాజిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ సరికొత్త పద్ధతిని కనుగొన్నారు. ఈ పద్ధతిని ‘హోలి గ్రెయిల్’గా పిలుస్తున్నారు.

ఈ కొత్త విధానం వల్ల మధుమేహ పరీక్ష చేయించుకున్న ప్రతిసారీ రక్తం ఇచ్చే బాధ తప్పుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్లూకోజ్‌ను గుర్తించే ఎంజైమును ట్రాన్సిస్టర్‌లో పొందుపర్చడం ద్వారా లాలాజలంలో గ్లూకోజ్ స్థాయిని గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఇదే విధానం ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు హార్వర్డ్ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement