Monday, April 15, 2024

స‌త్య‌నారాయ‌ణ‌గారి మృతి న‌న్ను క‌ల‌చి వేసింది.. ఎమోషనల్ ట్వీట్ చేసిన చిరంజీవి

తెలుగు సినీ క‌ళామ‌త‌ల్లి ముద్దుబిడ్డ న‌వ‌ర‌స న‌ట‌న సార్వ‌భౌముడు శ్రీ కైకాల స‌త్య‌నారాయ‌ణ‌గారు మృతి త‌న‌ని క‌ల‌చి వేసింద‌ని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. కైకాల గారి మరణం సినీ రంగానికే కాదు భారత సినీ రంగానికి తీర‌ని లోట‌న్నారు.. గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటుడు.. శ్రీ కైకాల సత్యనారాయణ గారు..ఈయన పోషించినటువంటి అనేక వైవిధ్యమైన పాత్రలు బహుశా భారత దేశంలో మరే నటుడు కూడా పోషించి ఉండరని తెలియజేశారు. కైకాల గారితో కలిసి ఎన్నో చిత్రాలలో నటించాననీ.. ఈ సందర్భంగా ఆయన నటన వైవిధ్యాన్ని వ్యక్తిత్వాన్ని దగ్గర నుంచి పరిశీలించే అవకాశం తనకు ఇచ్చినందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.. ఇక తనని తమ్ముడు అంటూ తోడబుట్టిన వాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం , ఆత్మీయత అంతకంతకు బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు. నటన, రుచికరమైన భోజనం ఈ రెండు కూడా కైకాల గారికి చాలా ఇష్టమని తెలియజేశారు. ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన ఈ లేఖ వైరల్ గా మారుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement