Thursday, April 18, 2024

వీరోచిత పోరాటం చేసిన యోధుడు సర్వాయి పాపన్న : మంత్రి ఎర్రబెల్లి

జనగామ : సర్దార్ సర్వాయి పాపన్న గొప్ప పోరాట యోధుడని, నిజాం పాలన పై తిరుగుబాటు చేసి బానిస పాలన పై యుద్ధం ప్రకటించారని.. ఆయన పోరాటం భావి తరాలకు స్ఫూర్తి అని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కొడకండ్లలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న కుటుంబంలో పుట్టి, అతి గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి సర్వాయి పాపన్న అని పేర్కొన్నారు. సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి లను ప్రభుత్వమే నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు అని, అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ లో 5 ఎకరాల స్థలంలో గౌడ భవనాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement