Wednesday, March 27, 2024

కడప జిల్లాలో భగుమన్న ముఠా కక్షలు.. సర్పంచ్ దారుణహత్య

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలోని కోమన్నూతల గ్రామంలో ముఠా కక్షలు భగ్గుమన్నాయి. దీంతో సర్పంచ్ చిన్న మునియప్పను వేటకొడవళ్లతో ప్రత్యర్థులు హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. సర్పంచుల శిక్షణ కోసం వైసీపీకి చెందిన చిన్న మునియప్ప పులివెందులకు వస్తుండగా మార్గంమధ్యలో ఈ హత్య జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

కాగా చిన్న మునియప్పకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రశాంతంగా ఉన్న మండలంలో ఇలా హత్య జరగడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. తాజా ఘటన గ్రామంలో విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే లింగాల మండల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆధిపత్య పోరుతోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: నాసాకు భారీ ఆఫర్ ప్రకటించిన జెఫ్ బెజోస్

Advertisement

తాజా వార్తలు

Advertisement