Wednesday, April 24, 2024

టీ20 వరల్డ్ కప్: అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్ ఠాకూర్

టీ20 ప్రపంచ కప్ సందర్భంగా భారత జట్టులో ఓ కీలక మార్పు చోటు చేసుకుంది. ఎంపికైన ఆటగాళ్లలో అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ మార్పు వెనుక ధోనినే పరోక్షంగా కారణమంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. ఐపీఎల్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ సీఎస్‌కేకు ఆడుతున్న సంగతి తెలిసిందే. ధోని నాయకత్వంలోని సీఎస్‌కే  ఈ సీజన్‌లో ఫైనల్‌ చేరిన సంగతి తెలిసిందే.

సీఎస్‌కే ఆడిన 15 మ్యాచ్‌ల్లో శార్దూల్‌ 18 వికెట్లు తీసి కీలకపాత్ర పోషించాడు. అంతేగాక లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. ఈ రెండు అంశాలు శార్దూల్‌కు ప్లస్‌గా మారాయని.. ధోని దగ్గరుండి అతనికి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చాడని సీఎస్‌కే ఫ్యాన్స్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే శార్దూల్‌పై ఫ్యాన్స్‌ ఫన్నీ మీమ్స్‌తో విరుచుకుపడ్డారు. లార్డ్‌ శార్దూల్‌ ఈజ్‌ బ్యాక్‌.. బీసీసీఐ అతన్ని సెలెక్ట్‌ చేయలేదు.. అతని టాలెంట్‌తో ఎంపికయ్యాడు. ధోని మెంటార్‌గా వచ్చాడు.. పని మొదలుపెట్టాడు.. అంటూ మీమ్స్‌తో రెచ్చిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement