Friday, April 19, 2024

Delhi | శరత్ చంద్రారెడ్డికి మరోసారి మధ్యంతర బెయిల్.. భార్య అనారోగ్యం నేపథ్యంలో 4 వారాలు బ్రేక్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డికి న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు (స్పెషల్ కోర్ట్) శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఇదే ఏడాది జనవరిలో తనను పెంచి, పెద్దచేసిన నానమ్మ చనిపోవడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ కోరిన శరత్ చంద్రారెడ్డి, ఆ మేరకు బెయిల్‌పై బయటికొచ్చారు.

ఇప్పుడు తన భార్య ఆరోగ్యం బాగోలేదని, ఆమెకు చికిత్స అందించే క్రమంలో తాను పక్కన ఉండాల్సిన పరిస్థితి ఉందని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో తనకు 6 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టును కోరారు. మానవీయ కోణంలో న్యాయస్థానం 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement