Monday, March 25, 2024

సంతోషం అవార్డులు.. డేట్ ని ప్రకటించిన సురేష్ కొండేటి

దాదాపు రెండు దశాబ్దాలుగా సంతోషం అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఈసారి కూడా అదే విధంగా సంతోషం పత్రిక అధినేత, నిర్మాత సురేష్ కొండేటి ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో సురేష్‌ కొండేటి అంటే తలలో నాలుకలా ఉంటారన్న పేరు ఉంది. సాధారణ స్థాయి నుండి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, సంతోషం పత్రిక అధినేత, నటుడు ఇలా పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి. అసలు అవార్డులు కార్య‌క్ర‌మం ప్రారంభించ‌డానికి కార‌ణం హీరో నాగార్జున అని సురేష్ చెబుతూ ఉంటారు. సంతోషం మ్యాగ‌జైన్ ఓపెనింగ్ రోజు అవార్డులు కూడా ప్ర‌ధానం చేస్తే బాగుంటుంద‌ని ఆయ‌న స‌ల‌హా ఇవ్వ‌డంతో ఇదంతా చేయ‌గ‌లిగానని ఆయన పలు సంధర్భాల్లో పేర్కొన్నారు. త‌ర్వాత స్టార్ హీరోలు చిరంజీవి , బాల‌కృష్ణ , వెంక‌టేష్ తనని ఎంత‌గానో ప్రోత్స‌హించారని అంటూ ఉంటారు.

తెలుగు సినిమాలకు గత 20 ఏళ్లుగా అవార్డులు అందిస్తున్న ‘సంతోషం’ వారపత్రిక ఆధ్వర్యంలో 21వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022 వేడుకలు డిసెంబర్ నెల 26న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సంతోషం అధినేత సురేష్ కొండేటి ఈ ఏడాది జరగబోయే ఫంక్షన్ కు సంబంధించి డేట్ ప్రకటించారు. డిసెంబర్ 26న హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి. సౌత్ ఇండియా లోని నాలుగు భాషల సినిమాలకు అవార్డులు అందిస్తూ వస్తున్నారు. డిసెంబర్ 26న జరగబోయే ఈ అవార్డు వేడుకల్లో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ బాషల సినిమాలకు అవార్డులు అందచేయనున్నారు. ఇక ఈ కార్యక్రమం మూడున్నర గంటలకు ప్రారంభమై పన్నెండు గంటల పాటు సాగనుంది, 12 గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement