Friday, March 29, 2024

కరోనాతో చనిపోయినవారి పిల్లలకు అండగా సందీప్ కిషన్

కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ మహమ్మారి కారణంగా చనిపోయిన వారి పిల్లలు అనాధలుగా మారుతున్నారు. అటువంటి వారిని ఆదుకునేందుకు హీరో సందీప్ కిషన్ ముందుకు వచ్చారు. మీకు తెలిసి కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఎవరైనా ఉంటే…[email protected] ను సంప్రదించండి.

వీలైనంతవరకు నా టీం, నేను వారిని జాగ్రత్తగా చూసుకుంటాం. రెండేళ్ల వరకూ వారి తిండి చదువుకు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటాను. ఇలాంటి కష్ట సమయంలో ఒకరికొకరు అండగా నిలబడాలి. అందరూ జాగ్రత్తగా ఉండండి. దయచేసి మీ చుట్టుపక్కల అవసరమైన వారికి చేతనైన సహాయం చేయండి అంటూ సందీప్ కిషన్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement