Wednesday, April 24, 2024

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో సమంత భేటీ

సెర్బియా – నటులు  వరుణ్ ధావన్ , సమంత రాష్ట్రపతిని కలిశారు. సెర్బియా పర్యటన లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. తాజాగా వరుణ్, సమంత కలిసి నటి స్తున్న వెబ్ సీరీస్ షూటింగ్ సెర్బియా లో కొనసాగుతున్నది . రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన విషయం తెలుసు కున్న సమంత మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను వరుణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ని కలిసే అవకాశం కలిగింది. సెర్బియాలో ద్రౌపది ముర్ము మేడంను కలిశాం.. మిమ్మల్ని కలవడం ఎంతో గొప్ప ఆనందాన్ని గౌరవాన్ని ఇచ్చింది అంటూ రాసుకొచ్చారు వరుణ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement