Wednesday, April 24, 2024

స‌ల్మాన్ క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే చంపేస్తాం.. గ్యాంగ్ స్ట‌ర్ వార్నింగ్

స‌ల్మాన్ ఖాన్ స్టార్ హీరోగా పేరు ఎంత ఉందో వివాదాలు కూడా అన్నే ఉన్నాయి. ల‌వ్ ఎఫైర్ ల‌తో పాటు.. ప‌లు వివాదాస్ప‌ద వార్త‌ల్లో నిలుస్తుంటాడు ఈ బాలీవుడ్ హీరో. స‌ల్మాన్ ఖాతాలో కృష్ణ జింకలను వేటాడిన కేసు కూడా ఒకటి. ఈ కేసు గురించి ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరిగాడు సల్లూ భాయి. అయితే రీసెంట్ గా ఆయనకు ఈకేసు నుంచి ఊరట లభించింది. కాని ఈ విషయంలో మనశాంతి మాత్ర కరువయ్యింది. కృష్ణ జింకలు బిష్ణోయ్ తెగవారికి ఆరాధ్య దైవం. ఈ విషయంలో సల్మాన్ పై వారు పట్టరాని కోపంగా ఉన్నారు. దాంతో ఈ విషయంలో ఆయనకు తిప్పలు తప్పడం లేదు. కృష్ణ జింకలను కులదైవంగా పూజించే బిష్ణోయ్ తెగ ప్రజలు సల్మాన్​పై మండిపడుతున్నారు. అంతే కాదు రీసెంట్ గా సల్మాన్​పై ఈ తెగకు సబంధించిన గ్యాంగ్​స్టర్ లారెన్స్ బిష్ణోయ్​ హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో ఆయన జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నాడు. అయితే జైల్లో ఉండి కూడా సల్మాన్ పై తన కోపాన్ని ప్రదర్శించాడు లారెన్స్. ఈ మధ్య ఒక టీవీ చానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ పై మరోసారి బెదిరింపులకు దిగాడు లారెన్స్ బిష్ణోయ్. సల్మాన్‌ మీద తమవారంతా కోపంతో ఉన్నారని .. అతను తమను తమ దైవాన్ని అవమానించాడని.. అందుకే అతనిపై అంతా తీవ్ర ఆగ్రహం ఉన్నారని తెలిపారు లారెన్స్ బిష్ణోయ్. అంతే కాదు సల్మాన్​ను జోధ్​పూర్​లోనే చంపుతానని లైవ్ లో వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక సల్మాన్ ను వదిలిపెట్టాలి అంటే.. అతను తమ కులదైవం ఆలయాన్ని దర్శించుకుని.. తమ వారికి క్షమాపణ చెబితే వదిలేస్తామని లారెన్స్ బిష్ణోయ్ స్పష్టం చేశాడు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ వార్నింగ్ ప్రస్తుతం సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement