కరోనా మహమ్మారి మరో జర్నలిస్టును బలి తీసుకుంది. సాక్షి టీవీ సీనియర్ జర్నలిస్ట్ ‘గరం గరం వార్తలు’ ఫేమ్ గోపి కరోనాతో చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. గత వారం రోజులుగా గోపి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆదివారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
కాగా సీనియర్ జర్నలిస్ట్ గోపి అకాల మృతి పట్ల ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విచారం వ్యక్తం చేశారు. గోపి కుటుంబ సభ్యులకు డీజీపీ ప్రగాఢ సానుభూతి తెలియాజేశారు. పలువురు మీడియా ప్రముఖులు కూడా గోపీ మరణం పట్ల సంతాపం తెలిపారు.