Saturday, April 20, 2024

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు: సజ్జల

ఏలూరు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించడం పట్ల వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే తీరులో ఫలితాలు వస్తాయని ధీమాగా చెప్పారు. ఏలూరు కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉండగా, మొదట్లోనే 3 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 47 డివిజన్లకు మార్చి 10న ఎన్నికలు నిర్వహించగా, కోర్టు ఆదేశాలతో కౌంటింగ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నిన్న ఓట్ల లెక్కింపు నిర్వహించగా వైసీపీ 44 డివిజన్లు చేజిక్కించుకోగా, టీడీపీకి 3 డివిజన్లలో విజయం లభించింది.

ఏలూరు ప్రజలంతా ఒకే మాటగా వైసీపీకి ఓటేశారని, తద్వారా సీఎం జగన్‌ను ఆశీర్వదించారని జగన్ వివరించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజారంజక పాలనకు ఇది తాజా నిదర్శనం అని పేర్కొన్నారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా తమ పాలన కొనసాగుతోందని వెల్లడించారు. ఏలూరులో 56.3 శాతం ప్రజలు వైసీపీకి ఓటేశారని, టీడీపీ కేవలం 28.2 శాతానికే పరిమితమైందని అన్నారు. పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీదే విజయం అని స్పష్టం చేశారు.

ఈ వార్త కూడా చదవండి: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement