Saturday, March 23, 2024

రిపబ్లిక్ మూవీ ట్రైలర్ విడుదల చేసిన మెగాస్టార్

మెగా హీరో సాయిధరమ్ తేజ్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. సాయితేజ్ ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్ ఇస్తూ రిపబ్లిక్ ట్రైలర్ విడుదల చేశారు.

సాయితేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1న విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష అంటూ రిపబ్లిక్ ట్రైలర్ ని తన ట్విట్టర్ లో విడుదల చేశారు రిపబ్లిక్ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ మూవీలోని సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. సాయిధరమ్ తేజ్ , దేవకట్టా కాంబినేషన్‌లో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’చిత్రంలో ఓ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ విశాఖ వాణిగా రమ్యకృష్ణ నటించింది. జగపతి బాబు మరో ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటించింది

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement