Friday, April 19, 2024

సాయిధరమ్‌తేజ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

హీరో సాయిధరమ్‌తేజ్ ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్ అపోలో ఆసుపత్రి వర్గాలు తాజా బులెటిన్ విడుదల చేశాయి. సాయిధరమ్‌తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు ఆ బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతానికి ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. సాయితేజ్‌కు వెంటిలేటర్ అవసరం క్రమంగా తగ్గుతోందని వివరించారు.

ఇటీవల హైదరాబాద్ నగరంలోని కేబుల్ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయితేజ్ ఓ స్పోర్ట్స్ బైకు నుంచి పడి తీవ్రగాయాలపాలవడం తెలిసిందే. సాయితేజ్ కాలర్ బోన్ విరిగినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. నిన్న అపోలో వైద్యులు సాయితేజ్ కాలర్ బోన్‌కు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement