Tuesday, April 23, 2024

సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ విడుదల వాయిదా?

‘ప్రస్థానం’ మూవీ ఫేం దేవకట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న విడుదల కావాల్సి ఉంది. కానీ సాయితేజ్ ప్రమాదానికి గురి కావడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించింది.

ఈ మూవీలో రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తుండగా బుధవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టర్‌లో చిత్ర యూనిట్ మూవీ విడుదల డేట్‌ను ప్రస్తావించలేదు. దీంతో రిపబ్లిక్ మూవీ వాయిదా పడుతుందనే వార్తలు ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. హీరోకు యాక్సిడెంట్ అయినప్పుడు సినిమాను రిలీజ్ చేయడం నైతికంగా కరెక్ట్ కాదని మేకర్స్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement