Friday, April 26, 2024

సాయి పల్లవి “గార్గి” మూవీ ట్రైలర్ రిలీజ్..

సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఎమోషనల్ కోర్ట్‌రూమ్ డ్రామాగా రూపొందుతున్న సినిమా గార్గి. తాజాగా కొద్దిసేపటి క్రితం ఈ మూవీ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు మేకర్స్. గౌతం రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్యలక్ష్మి, థామస్ జార్జ్ నిర్మించారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్. కాగా, ఈ మూవీ జూలై 15న థియేటర్లలో విడుదల కానుంది.

రిలీజ్ చేసిని మూడు నిమిషాల ట్రైలర్ లో సాయి పల్లవిని టీచర్‌గా క‌నిపిస్తోంది, ఆమె కుటుంబ సభ్యులలో ఒకరు కేసులో చిక్కుకుని న్యాయపరమైన స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటారు అని అర్థం అవుతుంది. అయితే తెలుగులో చివరిసారిగా విరాట పర్వంలో కనిపించిన సాయి పల్లవి, త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ లో రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్‌తో కలిసి కనిపించనుంది. ఈ సినిమాని కమల్ హాసన్ “రాజ్ కమల్ ఫిల్మ్స్” ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించ‌నుంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement