Friday, March 29, 2024

సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ నివాసంలో తీవ్ర విషాదం

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్ర‌సాద్ నివాసంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ బాబాయి బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆయ‌న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. అయితే ఇంత‌లోనే దేవిశ్రీ ఇంట మ‌రో విషాదం చోటు చేసుకుంది. దేవిశ్రీ బాబాయి బుల్గానిన్ మ‌రణ వార్త విని దేవిశ్రీ ప్ర‌సాద్ మేన‌త్త సీతా మ‌హాలక్ష్మీ గుండెపోటుతో మ‌ర‌ణించారు. దాంతో వ‌రుస మ‌ర‌ణ వార్త‌ల కారణంగా అతడి కుటుంబం తీవ్ర విషాదంలో నిండిపోయింది.

కాగా దేవిశ్రీ ప్ర‌సాద్ ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ చిత్రాల‌కు స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాటు దిల్ రాజు బ్యానర్‌లో వస్తున్న క్రేజీ బాయ్స్ సినిమాకు కూడా దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నాడు. మరోవైపు ఇప్ప‌టి వ‌ర‌కు దేవిశ్రీ, బ‌న్నీ, సుక్కు కాంబోలో తెర‌కెక్కిన ఆర్య, ఆర్య 2 సినిమాల‌కు స్వ‌రాలు సమ‌కూర్చగా.. ఈ రెండు సినిమాల పాట‌లు కూడా ఎంతో ఆక‌ట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement