Monday, March 18, 2024

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో సచిన్‌ రికార్డులు.. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ !

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో అత్యధిక రన్స్‌ చేసిన ఆటగాడు టీమిండియా మాజీ ప్లేయర్‌ సచిన్‌ టెండూల్కర్‌. అత్యధికంగా 9 సెంచరీలు బాదాడు. 16 అర్థ శతకాలు అతని ఖాతాలో ఉన్నాయి. నిప్పులు చెరిగే బ్రెట్‌లీ జాన్సన్‌, మెక్‌ గ్రాత్‌, గిలెస్పీ వంటి ఆసీస్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ అతను 3,262 పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో ఎక్కువ ఫోర్లు, సిక్సర్లు బాదిన ప్లేయర్‌ కూడా తనే. మాస్టర్‌ బ్లాస్టర్‌ ఈ ట్రోఫీలో 391 ఫోర్లు, 25 సిక్స్‌లు కొట్టాడు. అంతే కాదు 20 సార్లు 180 పరుగులకి పైగా భాగస్వామ్యాలు జోడించాడు. ఐదుసార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు, మూడుసార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు అందుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement