Thursday, April 18, 2024

తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతోంది. శనివారం నాడు సుమారు 18,211 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 7,227 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.09 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. దర్శనానికి వచ్చే భక్తులు విధిగా కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. తిరమల కొండపై కొవిడ్‌ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement