Tuesday, April 23, 2024

మంచినీటి వ్యాపారంలోకి ఆర్టీసీ.. బాటిల్‌ డిజైన్‌ సూచించి బహుమతిని గెలుచుకోవాలన్న సజ్జనార్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎప్పుడూ ఏదో ఒక అంశంతో మీడియాలో చర్చను ఉంచే ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తాజాగా మరో అంశాన్ని ట్విట్టర్‌లో తెరపైకి తెచ్చారు. ఆర్‌టీసీ మంచినీటి వ్యాపారం చేయబోతుందని, ఈ వ్యాపారానికి సంబంధించిన సలహాలు, సూచనలను అందించాలని, భేషైన సూచనలు చేసిన వారికి బహుమతి అందిస్తామని ప్రకటించారు. మంచి నీటి వాటర్‌ బాటిల్‌కు డిజైన్‌ సూచించండి…. ప్రైజ్‌ మనీ గెలుచుకోండంటూ ప్రకటన చేశారు. ఆర్టీసీ ప్రయాణికు కోసం సంస్థ 500 ఎంఎల్‌, లీటర్‌ నీటి బాటిళ్ళను తయారు చేసి విక్రయించాలని నిర్ణయించిందని సజ్జనార్‌ తెలిపారు. వాటర్‌ బాటిళ్ళకు మంచి డిజైన్‌ను సూచించాలని ట్విట్టర్‌ వేదికగా కోరారు. ఆర్టీసీలో తీసుకువస్తున్న మార్పులకు ప్రయాణికులు తోడ్పాటునిచ్చి చరిత్రలో నిలిచిపోవాలన్నారు. ప్రజలు తమ సూచనలను ఆర్టీసీ వాట్సప్‌ నంబర్‌ 9440970000కు పంపాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement