Monday, April 15, 2024

లారీ ఢీ కొని ఆర్టీసి డ్రైవర్ మృతి

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం శనిగరం గ్రామానికి చెందిన బాబర్ అనే వ్యక్తి లారీ ఢీ కొని మృతి చెందారు.బాబర్ నర్సంపేట ఆర్టీసి డిపో లో డ్రైవర్ గా పనిచేస్తున్నారు.విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో నల్లబెల్లి క్రాస్ వద్ద జాతీయ రహదారి పై జరిగిన సంఘటనలో బాబర్ తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించే క్రమంలో మృతి చెందగా, పరీక్షించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కళ్యాణి మరణాన్ని నిర్ధారించారు.బాబర్ మరణ వార్త తెలిసి ఆసుపత్రిలో బంధు వర్గాలు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.డ్రైవర్ మృతి విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ విజయ మాధురి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement