Friday, April 19, 2024

ఆర్ఎస్ఎస్ చీఫ్ కు కరోనా!

దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రతి రోజు కేసుల సంఖ్య లక్షపైనే నమోదవుతున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.  అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వైరస్ వస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌కు కూడా కరోనా వైరస్ వచ్చింది. ఇటీవలే మోహన్ భగవత్ కరోనా టీకా తొలి డోసు వేయించుకున్నారు. అయితే, భగవత్‌కు తేలికపాటి లక్షణాలు కనిపించగా.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన నాగ్‌పూర్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ మేరకు అర్ఎస్ఎస్ శ్రేణులు తెలిపాయి. ప్రస్తుతం భగవత్ ఆరోగ్య పరిస్థితి బాగుందని వెల్లడించాయి.  

Advertisement

తాజా వార్తలు

Advertisement