Friday, April 26, 2024

అనంత‌లో రూ.1.89 కోట్లు న‌గ‌దు ప‌ట్టివేత

అనంతపురం జిల్లాలో హవాలా నగదును దోపిడీ చేసిన కేరళకు చెందిన ముఠాను పోలీసుల త‌నిఖీల్లో ప‌ట్టుకున్నారు. మొత్తం న‌లుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. వీరి వ‌ద్ద నుంచి రూ.1.89 కోట్లు నగదు, మూడు కార్లు, ఐదు సెల్ ఫోన్లు, 13 నెంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్న‌ట్లు అనంత‌పురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. నిందితుల నుంచి మ‌రిన్ని వివ‌రాలు రాబ‌ట్టేందుకు విచారిస్తున్నామ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement