Thursday, April 25, 2024

RRR పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు..

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ సీఎం జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్లను సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రాఘురామ రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్ల బదిలీకి నిరాకరణ తెలిపింది. రఘురామ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్లపై కాసేపట్లో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది.

ఇది కూడా చదవండి: జ‌గ‌న్, విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ల‌ బ‌దిలీకి నో చెప్పిన హైకోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement