Friday, March 29, 2024

ఆస్కార్ అందుకుని హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చిన ఆర్ ఆర్ ఆర్ టీం

ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ఆస్కార్ అందుకుని హైద‌రాబాద్ కి తిరిగి వ‌చ్చింది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, రమా రాజమౌళి, కార్తికేయ, కాళభైరవ తదితరులు శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. పలువురు కుటుంబ సభ్యులతో వచ్చిన వీరికి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. తెల్లవారుజామున కూడా అభిమానులు, మీడియా ప్రతినిధులు ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. విజిల్స్ వేస్తూ, చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో ఉన్న పలువురు రాజమౌళి, కీరవాణితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. విమానాశ్రయంలో రాజమౌళి మీడియాతో మాట్లాడలేదు. నవ్వుతూ, హుషారుగా కనిపించిన ఆయన జైహింద్ అంటూ వెళ్లిపోయారు. జాతీయ మీడియాతో మాట్లాడిన కాళభైరవ.. ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ పాటను లైవ్ లో పాడటం తన జీవితంలోనే గొప్ప క్షణం అన్నారు. ఆస్కార్ అవార్డును అందుకోవడం చిరకాలం గుర్తిండిపోయ సందర్భం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement