Wednesday, April 24, 2024

కోడిపుంజు గుడ్డు పెడితే..ఇలా ఉంటుంది

అదేంటీ కోడి పెట్ట గుడ్లు పెడుతుంది కాని కోడి పుంజు గుడ్లు పెట్టడమేంటని ఆలోచిస్తున్నారా..అవును కోడి పుంజు నిజంగానే గుడ్లు పెట్టింది. కేవలం గుడ్లు పెట్టడమే కాదు వాటిపై పొదిగి పిల్లల్ని కూడా కనింది. ఇంతకి ఎక్కడి జరిగింది ఈ వింత అనుకుంటున్నారా.. తూర్పుగోదావరి జిల్లా తొట్టంబేడు మండలంలోని పెద్దకన్నలిలో చోటుచేసుకుంది అరుదైన సంఘటన. గ్రామానికి చెందిన సుబ్రమణ్యంరెడ్డికి ఇంట్లో 4 కోళ్లతో పాటు ఒక పుంజు ఉండేది. అయితే ఓరోజు కోడి పుంజు గుడ్లు పెట్టడం చూసి ఆశ్చర్యపోయిన సుబ్రమణ్యం రెడ్డి…ఆ గుడ్డుని జాగ్రత్తగా పొదుగుకి పెట్టాడు. అలా ఆ పుంజు ఐదు గుడ్లను పెట్టడంతో అన్నింటిని కూడా పుంజు కింద పొదుగుకి పెట్టాడు. దీంతో కొన్నిరోజులకు ఆ పుంజు ఐదు పిల్లలను కన్నది. ఇప్పుడు ఆ ఐదు పిల్లలతో పుంజు ఎంచక్కా విధులలో విహరిస్తోంది. దీంతో ఈ విషయం చుట్టుప్రక్కల గ్రామాలకు తెలియడంతో పుంజును చూడటానికి ఆ గ్రామానికి తండోపతండాలుగా వస్తున్నారట. అయితే పుంజు గుడ్లు పెట్టడంపై వెటర్నరీ అధికారి వీరభద్రరెడ్డి వివరణ ఇచ్చారు. జన్యుపరమైన కారణాలతో ఇలా అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతాయని తెలిపారు. ఏది ఏమైన కోడి పుంజు గుడ్డు పెట్టి పిల్లల్ని కనడమనేది ఓ వింతలా భావిస్తున్నారు అక్కడి ప్రజలు.

ఇది కూడా చదవండి: Tokyo Olympics: బాహుబలి బంగారం కొట్టాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement