Thursday, April 25, 2024

రండి…కెసిఆర్ కి కోటి మొక్క‌లు కానుక‌గా ఇద్దాంః రోజా

హైదరాబాద్‌: కోటి వృక్షార్చనలో పాల్గొని సీఎం కేసీఆర్‌కు హరిత కానుక అందిద్దామని నటి, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ నెల 17 న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొందామని, ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటుదామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేద్దామని చెప్పారు. ఈ మేర‌కు రోజా ఒక వీడియోను విడుద‌ల చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement