Saturday, April 20, 2024

టెస్ట్‌కు అందుబాటులో రోహిత్‌ ?

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. బంగ్లాతో జరిగిన రెండో వన్డేలో రోహిత్‌ వేలికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో అతన్ని మూడో వన్డేకు దూరం పెట్టారు. డిసెంబర్‌ 14వ తేదీన బంగ్లాతో తొలి టెస్ట్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గాయపడ్డ రోహిత్‌కు బీసీసీఐ మెడికల్‌ బృందం పరీక్షలు చేస్తోందని , స్పెషలిస్ట్‌ కన్సల్టేషన్‌ కోసం అతను ముంబైకి వెళ్లాడని, మూడో వన్డే రోహిత్‌ మిస్సవుతాడని, ఇక టెస్ట్‌ సిరీస్‌కు అతను అందుబాటులో ఉంటాడో లేదో అన్న విషయాన్ని తర్వాత వెల్లడించనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. బంగ్లాతో జరిగే మూడో వన్డేలో భారత జట్టులోకి కుల్దిప్‌ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement