Friday, April 19, 2024

రోహిత్‌, రాహుల్‌ ఔట్‌.. టీ-20కే కాదు వన్డే కి కూడా

శ్రీలంకతో జరగనున్న టీ 20 సిరీస్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కెఎల్‌ రాహుల్‌ దూరం కానున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా వీరిద్దరూ వన్డే సిరీస్‌కు దూరమవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు ధృవీకరించారు. బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో రోహిత్‌ చేతి వేలికి గాయమైన సంగతి తెలిసిందే. ఇంకాగాయం నుంచి పూర్తిగా కోలుకోని రోహిత్‌ శర్మ ఇప్పుడు మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదంటున్నారు.

రోహిత్‌ స్థానంలో హార్థిక్‌ పాండ్యా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలివుడ్‌ కథానాయిక అతియాశెట్టితో కెఎల్‌ రాహుల్‌ పెళ్లి నేపథ్యంలో అతనికి బీసీసీఐ విరామం ఇచ్చింది. టీ20లతో బాటు వన్డే సిరీస్‌లకు రాహుల్‌ దూరంగా ఉంటారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement