Wednesday, April 24, 2024

Road Terror – ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు మృతి

ఖమ్మం : ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల కేంద్రం సమీపంలోని పెట్రోల్ బంకు వద్ధ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలకు గురైన మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్ లో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
మృతులు పారుపల్లి రాజేష్ సుజాత దంపతులు, వారి కుమారుడు అశ్విత్ (13) గా గుర్తించారు. వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన వారిగా సమాచారం.


హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో రాజేష్ ఉద్యోగిగా పని చేస్తున్నట్లు తెలిసింది. హైదరాబాదు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలాన్ని వైరా డి.ఎస్.పి రహమాన్, ఇతర పోలీసు అధికారులు సందర్శించారు. దారుణ సంఘటనతో విప్పల మరక గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement