Wednesday, April 24, 2024

విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం…. ఐదుగురు మృతి

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 5 మృతి చెందారు. విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదుగా వస్తున్న రెండు ఆర్టీసి బస్సులు ఢీ కోటుకున్నాయి. కాగా ఆ సమయంలో ఆర్టీసీ బస్సును వెనుక నుంచి మరో లారీ ఢీ కొట్టింది. ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లతో పాటు ముగ్గురు ప్రయాణీకులు మృతి చెందారు.పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. డంపింగ్ యార్డ్ దట్టమైన పొగ అలుముకోవడంతో పాటు అతి వేగమే ప్రమాదానికి కారణంగా స్థానికులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement