Friday, March 29, 2024

వికారాబాద్ లో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం

వికారాబాద్ జిల్లాలో జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న వాహనం కొడంగల్ శివారులోని ఎల్లమ్మ ఆలయం వద్ద ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలైయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement